వైవీ సుబ్బారెడ్డి, కాపు రామచంద్రారెడ్డిపై Ex minister కాలవ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-21T22:24:24+05:30 IST

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామచంద్రారెడ్డి అధికార అహంకారంతో విర్రవీగుతున్నాడని

వైవీ సుబ్బారెడ్డి, కాపు రామచంద్రారెడ్డిపై Ex minister కాలవ ఆగ్రహం

అనంతపురం: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామచంద్రారెడ్డి అధికార అహంకారంతో విర్రవీగుతున్నాడని ఆరోపించారు.మూడు రోజుల క్రితం ప్రసన్న వెంకటరమణ స్వామి కల్యాణోత్సవం మూడు గంటలు ఆలస్యం చేశారని పేర్కొన్నారు. అగ్రవర్ణ దురహంకారంతో దేవుడి పెళ్లి కూడా ఆలస్యం చేసిన ద్రోహులు రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అని విమర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం తగదన్నారు.  

Updated Date - 2022-05-21T22:24:24+05:30 IST