తెనాలిని జిల్లా చేయాలి
ABN , First Publish Date - 2022-01-29T05:37:13+05:30 IST
తెనాలిని జిల్లా చేసి వేమూరు నియోజకవర్గాన్నీ తెనాలి కింద ఉంచాలని మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.
నక్కా ఆనందబాబు
గుంటూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): తెనాలిని జిల్లా చేసి వేమూరు నియోజకవర్గాన్నీ తెనాలి కింద ఉంచాలని మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. వేమూరును బాపట్ల జిల్లాలో కలపటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఫాల్స్గా తయారయ్యేలా కనపడుతోందని విమర్శించారు. ఉద్యోగుల ఉద్యమం, క్యాసినో ఆరోపణలతో ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే అర్ధరాత్రి జీవోతో జిల్లాల విభజన ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్రజల కోసం, పరిపాలన కోసం కాకుండా కులాల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు.