Ex Ministerపై అవినీతి కేసు
ABN , First Publish Date - 2022-05-22T14:32:06+05:30 IST
గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వైద్యలింగం రూ.28 కోట్ల నగదును లంచంగా స్వీకరించారని ఆర్పోర్ ఇయ్యక్కం సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంఽధించిన
- ఏసీబీకి ఆధారాల సమర్పణ
- అర్పోర్ ఇయ్యక్కం ఆరోపణ
అడయార్(చెన్నై): గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వైద్యలింగం రూ.28 కోట్ల నగదును లంచంగా స్వీకరించారని ఆర్పోర్ ఇయ్యక్కం సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను ఆ సంస్థ రాష్ట్ర అవినీతి నిరోధఖ శాఖ (ఏసీబీ)కి సమర్పించింది. ఇదే విషయంపై ఆ సంస్థ కన్వీనర్ జయరాం వెంకటేశన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2015-16 మధ్యకాలంలో మంత్రిగా ఉన్న వైద్యలింగం శ్రీరామ్ గ్రూపు నుంచి రూ.28 కోట్లను లంచంగా స్వీకరించారని, దీనికి సం బం ధించిన ఆదారాలను ఏసీబీకి సమర్పించినట్టు తెలిపా రు. 2015 -16లో నగర శివారు ప్రాంతమైన పెరుంగళత్తూరులో శ్రీరామ్ గ్రూపు 1,453 గృహాల బహుళ అంతస్తుల ప్రాజెక్టు నిర్మాణానికి 2013లో సీఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి రెండేళ్ల తర్వాత అనుమతి ఇచ్చారన్నారు. ఆ అనుమతి జారీ కోసం మాజీ మంత్రి వైద్యలింగం రూ.27.9 కోట్లను లంచంగా పుచ్చుకున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఆ గ్రూపునకు చెందిన భారత్ కోల్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా అన్ సెక్యూర్డ్ లోన్ పేరిట వైద్యలింగం కుమారుడు ప్రభుకు చెందిన ముత్తమ్మాళ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 2015 -16లో నిధులను బట్వాడా చేశారని వివరించారు. శ్రీరామ్ గ్రూపు ప్రారంభించిన ప్రాజెక్టుకు అనుమతి, ఈ నిధుల బట్వాడా ఏకకాలంలో జరిగిందని గుర్తుచేశారు. ఈ నిధులతో వైద్యలింగం కుమారుడు ప్రభు పాప్పకురిచ్చి ప్రాంతంలో 4.5 ఎకరాల భూములను రూ.24 కోట్లకు కొనుగోలు చేశారన్నారు. ఈ అంశంలో మాజీ మంత్రి వైద్యలింగం, ఆయన కుమారుడు ప్రభు, సీఎండీఏ అధికారులతో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.