మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేసీఆర్
ABN , First Publish Date - 2022-06-03T22:20:28+05:30 IST
Telangana: కర్నాటక రాష్ట్రం కుల్బుర్గి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక్కో
Telangana: కర్నాటక రాష్ట్రం కుల్బుర్గి బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక్కో క్షతగాత్రుడికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం ఆదేశించారు.