ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలి: ఎల్వీ సుబ్రమణ్యం

ABN , First Publish Date - 2021-01-24T03:17:28+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపు నిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ..

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలి: ఎల్వీ సుబ్రమణ్యం

గుంటూరు: ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పిలుపు నిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాలన్నారు. ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని నిర్భయంగా అడిగి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T03:17:28+05:30 IST