మాజీ కౌన్సిలర్ దాతృత్వం
ABN , First Publish Date - 2021-01-24T06:00:08+05:30 IST
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లల విద్య కోసం చిత్తూరుకు చెందిన మాజీ కౌన్సిలర్ పార్థసారథి రూ.10వేల సాయం అందజేశారు
చిత్తూరు రూరల్, జనవరి 23: తల్లిదండ్రులను కోల్పోయి ఏ ఆసరాని అక్కాతమ్ముళ్ల చదువు కోసం చిత్తూరుకు చెందిన ఓ మాజీ కౌన్సిలర్ ఆర్థిసాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. బంగారుపాళ్యం మండలం నలగాంపల్లె కాలనీకి చెందిన మదన్, అమ్ములు దంపతులకు కుమార్తె నవీనా, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. కాగా, వీరి తండ్రి గతంలో అనారోగ్యంతో మృతిచెందగా, ఇటీవల తల్లీ చనిపోయింది. పిల్లల దుస్థితిపై ‘చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. దీంతో నగరానికి చెందిన మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు స్పందించారు. శనివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో అక్కాతమ్ముళ్లకు రూ.10వేల నగదు, నూతన వస్త్రాలు అందజేశారు. పిల్లలకు సాయం చేసే దాతలు వివరాలకు నెం.9491060247ను సంప్రదించాలని ఆయన కోరారు.