Uttarakhand కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ కిషోర్ ఉపాధ్యాయ్పై బహిష్కరణ వేటు
ABN , First Publish Date - 2022-01-27T15:27:27+05:30 IST
ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ కిషోర్ ఉపాధ్యాయ్ను పార్టీ నుంచి బహిష్కరించారు....
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ కిషోర్ ఉపాధ్యాయ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. కిషోర్ ఉపాధ్యాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇన్చార్జి దేవేందర్ యాదవ్ చెప్పారు. ఈ బహిష్కరణ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని పార్టీ ప్రకటించింది. కిషోర్ ఉపాధ్యాయ్ ను ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు యాదవ్ వివరించారు. ఉపాధ్యాయ్ తెహ్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2002,2007 సంవత్సరాల్లో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఉపాధ్యాయ్ ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించగా, అతను బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ తెహ్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషోర్ ఉపాధ్యాయ్ ను ఎన్నికల బరిలోకి దించింది.