ఆ 17మంది Bjpలోనే ఉంటారో లేదో చెప్పలేను..

ABN , First Publish Date - 2022-05-13T16:53:49+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కారకులైన 17మంది ఎమ్మెల్యేలు బీజేపీలోనే ఉంటారో లేదే చెప్పలేననే బీజేపీ అగ్రనేత యడియూరప్ప వ్యాఖ్యలు సర్వత్రా

ఆ 17మంది Bjpలోనే ఉంటారో లేదో చెప్పలేను..

                      - యడియూరప్ప వ్యాఖ్యలతో సర్వత్రా కలకలం


బెంగళూరు: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కారకులైన 17మంది ఎమ్మెల్యేలు బీజేపీలోనే ఉంటారో లేదే చెప్పలేననే బీజేపీ అగ్రనేత యడియూరప్ప వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం కలిగిస్తున్నాయి. గురువారం మైసూరులో యడియూరప్ప మీడియాతో మాట్లాడిన సందర్భంలో మం త్రివర్గ విస్తరణ మరో రెండురోజుల్లోనే ఖరారు కానుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కీలకులైన 17మంది పార్టీలోనే కొనసాగుతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు నేనేమి చెప్పలేనని నాకు తెలియదంటూ దాటవేశారు. ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణ అంశం హాట్‌ టాపిక్‌గా సాగుతున్న వేళ ఇటువంటి వ్యాఖ్యలు సర్వత్రా ఆశ్చర్యం కలిగించాయి. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  నాగేష్‌ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇక మంత్రి ఎంటీబీ నాగరాజు పార్టీ ఫిరాయించి తప్పు చేశాననే వ్యాఖ్యలు తెలిసినవే. ఇటువంటి తరుణంలోనే యడియూరప్ప వ్యాఖ్యలు మరింత ఆసక్తి కలిగించేలా మారాయి. రెండున్నరేళ్ళలో 17 మందికి వ్యతిరేకంగా యడియూరప్ప మాట్లాడిన సందర్భాలే లేవు. కాగా ప్రస్తుతం కేబినెట్‌లో ఉండే వారిలో ఎం తమందిని కొనసాగిస్తారనేది కూడా కీలకంగా ఉంది. ఖాళీగా ఉండే ఐదుస్థానాలతో భర్తీ చేయకుండా పూర్తిగా ప్రక్షాళన చేస్తారనే చర్చలు సాగుతున్న తరుణంలో యడియూరప్ప వ్యాఖ్యలు ప్రత్యేకత అనిపిస్తున్నాయి. కాగా విజయేంద్రను కేబినెట్‌లోకి చేర్చుకుంటారా అనే ప్రశ్నకు యడియూరప్ప తెలియదంటూ దాటవేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై కూడా మూడురోజులలో నిర్ణయాత్మకమైన మార్పులు ఉంటాయనడం వెనుక భారీ అంతర్యమే ఉంటుందనే చర్చలు జోరందుకున్నాయి.

Read more