హిందూ, ముస్లింలు ఒకే తల్లిబిడ్డలు
ABN , First Publish Date - 2022-04-12T16:45:16+05:30 IST
రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా మతం ప్రాతిపదకన జరుగుతున్న అరాచకాలపై ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. హిందూ, ముస్లింలు ఒకే
- సామరస్యాన్ని దెబ్బతీస్తే సహించను
- మాజీ సీఎం యడియూరప్ప హెచ్చరిక
బెంగళూరు: రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా మతం ప్రాతిపదకన జరుగుతున్న అరాచకాలపై ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. హిందూ, ముస్లింలు ఒకే తల్లి బిడ్డలని పేర్కొన్నారు. బెంగళూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించానన్నారు. కర్ణాటక శాంతికి పెట్టింది పేరన్నారు. రోజురోజుకు వెర్రి తలకెక్కి చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతుండడం తనను మానసికంగా బాధ కలిగిస్తోందన్నారు. ధారవాడలో నిరుపేద ముస్లిం వ్యాపారిపై జరిగిన దాడి తనను కలచివేసిందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే దిశలో ప్రతిపక్షాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు.