మాజీ ముఖ్యమంత్రి సతీమణికి అస్వస్థత
ABN , First Publish Date - 2022-03-11T13:46:03+05:30 IST
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి, ముఖ్యమంత్రి స్టాలిన్ తల్లి దయాళు అమ్మాళ్ (89) గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను
ప్యారీస్(చెన్నై): దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి, ముఖ్యమంత్రి స్టాలిన్ తల్లి దయాళు అమ్మాళ్ (89) గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను స్టాలిన్ పరామర్శించారు. కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న దయాళు అమ్మాళ్ గోపాలపురంలోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో వుంటున్నారు. ఈ క్రమంలో, గురువారం ఉదయం ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆమెను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.