Former Chief Minister: బీజేపీ స్వార్థ రాజకీయాలకు నిరుపేదలు బలి
ABN , First Publish Date - 2022-07-29T18:40:00+05:30 IST
బీజేపీ స్వార్ధ రాజకీయాలకు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు బలవుతున్నారని మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అగ్రనేత హెచ్డి. కుమారస్వామి
- మాజీ సీఎం కుమారస్వామి
బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ స్వార్ధ రాజకీయాలకు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు బలవుతున్నారని మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) జేడీఎస్ అగ్రనేత హెచ్డి. కుమారస్వామి తీవ్ర ఆరోపణ చేశారు. మైసూరులోని కేఆర్ నగర్లో గురువారం ఆయన డా. అంబేడ్కర్ భవనానికి శంఖుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హిందుత్వ పేరుతో రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ సొంత పార్టీ కార్యకర్తలనే ఇందుకు బలిపీఠం ఎక్కిస్తోందని విరుచుకుపడ్డారు. బీజేపీ(Bjp) పాలనలో కార్పోరేట్ కంపెనీల అధినేతల ఆదాయం ఎన్నోరెట్లు కాగా జీఎస్టీ(Gst) బాదుడు, పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల పెరుగుదలతో సామాన్యుడి పరిస్ధితి మాత్రం దుర్భరంగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపి ఏడాది పాలనలో అవినీతి అక్రమాలు సమాజంలో దారుణంగా దెబ్బతిన్న శాంతి తప్పిదే ఇంకెలాటి సాధనలు లేవని ఆయన ఎద్దేవా చేశారు.