టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-03-29T01:56:50+05:30 IST

టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు అని ఆయన చెప్పారు. కరోనాను..

టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

మంగళగిరి: టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు అని ఆయన చెప్పారు. కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరిందన్నారు. ఇతర దేశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు. కరోనా వైరస్ టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకుంటే బాగుండేదని చెప్పారు. ఉపాధి కోల్పోయిన చేతివృత్తులవారిని ప్రభుత్వమే ఆదుకోవాలని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-03-29T01:56:50+05:30 IST