టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది

ABN , First Publish Date - 2022-08-18T06:15:35+05:30 IST

పిఠాపురం, ఆగస్టు 17: ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ నియోజకవర్గంలో పార్టీ తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. అమరావతిలో బుధవారం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో నిర్వహించిన దళిత గర్జన, వైసీపీ ప్రభు

టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది
బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న చంద్రబాబు, వర్మ

పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమాల 

నిర్వహణపై అధినేత చంద్రబాబు అభినందన

పిఠాపురం, ఆగస్టు 17: ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ నియోజకవర్గంలో పార్టీ తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. అమరావతిలో బుధవారం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ చంద్రబాబును కలిశారు. నియోజకవర్గంలో నిర్వహించిన దళిత గర్జన, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన దళితుల సంక్షేమానికి సంబంధించి 28 పథకాల రద్దుపై అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించిన కార్యక్రమాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై చేపట్టిన ఆందోళనలను వివరించా రు. నియోజకవర్గంలో చంద్రబాబు హాయాంలో టీడీపీ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వర్మ ప్రచురించిన బుక్‌లెట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధే మిగిలిందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ పాలనలో అంతా రివర్స్‌ జరుగుతున్నదని, విధ్వంసం తప్ప వీరికి అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టిలేదని విమర్శించారు. ఇదే విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఓటరుని కలుసుకుని బుక్‌లెట్‌ అందించి చంద్రబాబు పాలనలో జరిగిన అభివృద్ధికి తెలియజేయస్తు న్నామని వర్మ వివరించారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో చేరికలపై చంద్రబాబుతో చర్చించారు. 

Updated Date - 2022-08-18T06:15:35+05:30 IST