సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు.. అర్ధరాత్రి ఒంటిగంటకు బయటికొచ్చిన 22 ఏళ్ల యువతి.. ఎదురుగా ముగ్గురు కుర్రాళ్లు.. చివరకు..

ABN , First Publish Date - 2021-10-21T14:36:34+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఒక హృదయవిదారక ఘటన..

సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు.. అర్ధరాత్రి ఒంటిగంటకు బయటికొచ్చిన 22 ఏళ్ల యువతి.. ఎదురుగా ముగ్గురు కుర్రాళ్లు.. చివరకు..

దేశరాజధాని ఢిల్లీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి బిందాపూర్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ యవతి హత్య వెనుక ఆమె స్నేహితుని హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. అతను ఆమెను వస్‌సైడ్‌ లవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ వీడియోలో.. ముగ్గురు కుర్రాళ్లు కనిపిస్తున్నారు. 


ఒక యువకుడు కత్తితో ఆ యువతిపై హఠాత్తుగా దాడి చేయడంతో ఆమె కిందపడిపోయింది. తరువాత ఆ యువకుడు ఆమె జుట్టు పట్టుకుని దాడి చేయడం కనిపిస్తుంది. ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేస్తుండగా, ఆమె వారి నుంచి తప్పించునేందుకు ప్రయత్నంచడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ తరువాత ఆమె అక్కడే ప్రాణాలొదులుతుంది. ఆమె మాజీ ప్రియుడు అంకిత్ ఆమెపై దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువతి అర్థరాత్రి దాటాక తమ ఇంటిలోని వారితో.. తన స్నేహితురాలిని కలుసుకునేందుకు వెళుతున్నానని చెప్పింది. కొద్దిసేపటికే ఆమె హత్యకు గురయ్యింది. మృతురాలిని పోలీసులు.. డాలీ బబ్బర్‌గా గుర్తించారు. ఈ ఘటనలో అంకిత్ గాబా, హిమాంశు, మనీష్‌ల హస్తమున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడి జరిగిన తరువాత ఆమె స్వయంగా ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఫలితం లేక కుప్పకూలిపోయింది.

Updated Date - 2021-10-21T14:36:34+05:30 IST