సివిల్స్లో ‘ఈడబ్ల్యూఎస్’ కటాఫ్ తక్కువే
ABN , First Publish Date - 2020-08-13T07:07:15+05:30 IST
సివిల్ సర్వీసెస్-2019 పరీక్షల్లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎ్స)అభ్యరుల కటాఫ్ ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) కన్నా తక్కువగా ఉంది. గతవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో...
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2019 పరీక్షల్లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎ్స)అభ్యరుల కటాఫ్ ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) కన్నా తక్కువగా ఉంది. గతవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. 3 దశల్లో జరిగిన పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్) ఓబీసీ అభ్యర్థుల కటాఫ్ కంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ బాగా తక్కువగా ఉంది. మెయిన్ పరీక్షల్లో కటాఫ్ ఎస్సీ,ఎస్టీ అభ్యర్థుల కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తగ్గింది. దీంతో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రతిష్ఠాకరమైన సివిల్ సర్వీసుల్లో కోటా లేకుండా విజయం సాధించడం కష్టమని తేలింది. యూపీఎస్సీ 829 మందిని ఎంపిక చేసిన సివిల్స్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు తొలిసారిగా కేంద్రం రిజర్వేషన్లను అమలు చేసింది.