ఈ-వే బిల్లులకు నెలాఖరు వరకు గడువు
ABN , First Publish Date - 2020-04-05T06:08:44+05:30 IST
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ రహదారుల వద్ద సరుకు రవాణా లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ఉన్నాయి.
దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ రహదారుల వద్ద సరుకు రవాణా లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జీఎ్సటీ ఈ-వే బిల్లుల గడువు తేదీని ఈ నెల చివరి వరకు పొడిగించింది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో గడువు ముగిసే ఈ-వే బిల్లులకు మాత్రమే ఈ గడువు పొడిగింపు వర్తించనుంది. జీఎ్సటీ చట్టం ప్రకారం.. రూ.50,000 మించి విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించేందుకు ఈ-వే బిల్లు తప్పనిసరి.