ఈవీఎం పైనా? బ్యాలెట్‌ పైనా??

ABN , First Publish Date - 2020-09-22T08:30:32+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించింది. ఇటీవలే ఎస్‌ఈసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పార్థసారధి ఎన్నికల విషయమై ఎస్‌ఈసీ, జీహెచ్‌ఎంసీ

ఈవీఎం పైనా? బ్యాలెట్‌ పైనా??

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించింది. ఇటీవలే ఎస్‌ఈసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పార్థసారధి ఎన్నికల విషయమై ఎస్‌ఈసీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 10 నాటికి జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుండటంతో ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లన్నీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక.. కరోనా మహమ్మారి నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను ఎలా నిర్వహించాలన్నదానిపై రాజకీయ పార్టీల వద్ద ఎస్‌ఈసీ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)లపై నిర్వహించాలా లేక బ్యాలెట్‌ పత్రాలపై నిర్వహించాలో తెలపాలంటూ ఎస్‌ఈసీ కార్యదర్శి జయసింహారె డ్డి సోమవారం వివిధ పార్టీలకు లేఖలు రాశారు. ఈ నెల 30లోగా ఆయా పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించారు.

Updated Date - 2020-09-22T08:30:32+05:30 IST