భూముల విక్రయం చేతగానితనానికి నిదర్శనం

ABN , First Publish Date - 2021-07-31T06:10:09+05:30 IST

ప్రభుత్వ భూములు విక్రయించడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు.

భూముల విక్రయం చేతగానితనానికి నిదర్శనం
కొత్తబస్టాండ్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు

సూర్యాపేట అర్బన్‌, జూలై 30 : ప్రభుత్వ భూములు విక్రయించడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కొత్తపల్లి శివకుమార్‌ అన్నారు. ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేశారన్నారు. ప్రభుత్వ భూములను మార్కెట్‌ రేటు కంటే తన అనుచరులకు తక్కువకే విక్రయించి కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి రేణుక, ఆరుట్ల శంకర్‌రెడ్డి, దొంతమల్ల రామన్న, వీరబాబు, వేణు, రాము, గోపి, రామోజీ, రాకేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:10:09+05:30 IST