ఊరూరా మొక్కలు నాటాలి..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
ABN , First Publish Date - 2020-09-21T06:53:42+05:30 IST
ఊరూరా మొక్కలు నాటి, వనాలను విస్తరింపచేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జనగామ ఎమ్మెల్యే
జనగామ(లింగాలఘణపురం), సెప్టెంబరు 20 : ఊరూరా మొక్కలు నాటి, వనాలను విస్తరింపచేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం జనగామ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మేకల కళింగరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అమలు జరిగేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించడమే లక్ష్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నిమ్మతి దీపికారెడ్డి, వైస్ఎంపీపీ చంద్రశేఖర్ ఎంపీడీవో సంపత్కుమార్, తహసీల్దార్ రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, ఐబీడీఈ రవీందర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.