పట్టణ పురపాలికల్లో స్థానికపోరుకు సర్వం సిద్దం

ABN , First Publish Date - 2021-11-14T21:04:12+05:30 IST

పట్టణ పురపాలికల్లో స్థానికపోరుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. సోమవారం 325 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది.

పట్టణ పురపాలికల్లో స్థానికపోరుకు సర్వం సిద్దం

అమరావతి: పట్టణ పురపాలికల్లో స్థానికపోరుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. సోమవారం 325 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది. 353 వార్డులలో ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. 28 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 8, 62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 908 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాబడిన ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్‌ సమయంలో చివరి గంటలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పొలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. త్వరితగతిన కౌంటింగ్‌ ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.

Updated Date - 2021-11-14T21:04:12+05:30 IST