సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-08-15T04:53:49+05:30 IST
నూతన జిల్లాగా ఏర్పాటైన నంద్యాల మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.
పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్, ఎస్పీల రిహార్సల్స్
నంద్యాల టౌన్, ఆగస్టు 14: నూతన జిల్లాగా ఏర్పాటైన నంద్యాల మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. వజ్రోత్సవ పంద్రాగస్టు వేడుకలు జరుగుతుండటంతో అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రఘువీర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య తదితరులు పరిశీలించారు. సోమవారం జరగ నున్న పంద్రాగస్టు వేడుకలకు రిహార్సల్స్లో భాగంగా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. పరేడ్ రిహార్సల్స్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ తదితరులు పోలీసు కవాతును పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న ప్రముఖులు, స్వాతం త్య్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధి కారు లు, ప్రజలకు కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్షించారు. ప్రభుత్వ పతకాల శకటాలు, పోలీస్ కవాతు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ ప్రదర్శన తోపాటు బహుమతుల ప్రదానం చేయనున్నారు. కార్యక్ర మంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.