జెండా పండుగకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

జెండా పండుగకు సర్వం సిద్ధం

జెండా పండుగకు సర్వం సిద్ధం
వికారాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వేదిక ఏర్పాటు

 వికారాబాద్‌/మేడ్చల్‌, ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన  సందర్భంగా  సోమవారం జిల్లా స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించేందుకు వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల యం త్రాంగ్రం సర్వం సిద్ధం చేసింది. వికారాబాద్‌లో పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు ముఖ్యఅతిథిగా హాజరై ఉదయం 10.30 గంటలకు  జాతీయపతాకం ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేయనున్నారు. మేడ్చల్‌ జిల్లాలో ఉదయం 10గంటలకు కలెక్టరేట్‌లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు. కాగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. 



Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST