డెంగ్యూ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-05-17T04:05:24+05:30 IST
డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పీహెచ్సీ సూపర్వైజర్ రేణుక అన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బెజ్జూరు, మే 16: డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పీహెచ్సీ సూపర్వైజర్ రేణుక అన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. పగటిపూట కుట్టే దోమవల్ల డెంగ్యూ వ్యాధి వసుందని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎల్టీ దిలీప్, ఏఎన్ఎంలు సునీత, రాంబాయి, బుజ్జి, స్వరూప, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
జైనూరులో..
జైనూరు: గ్రామాల్లో డెంగ్యువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని వైద్యాధికారి నాగేంద్ర కోరారు. మండ లంలోని జైనూరు, ఉషేగాం పీహెచ్సీల పరిధిలో సిబ్బంది డెంగ్యూ నిర్మూలపై సోమవారం ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న సాధారణ జ్వరాలను గుర్తించి బాధితులకు వైద్యం అందించాలని కోరారు.