ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

ABN , First Publish Date - 2021-04-11T04:38:48+05:30 IST

ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డీఎస్పీ వాసుదేవన్‌, రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప తెలిపారు.

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

సుండుపల్లె, ఏప్రిల్‌10: ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డీఎస్పీ వాసుదేవన్‌, రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప తెలిపారు. శనివారం స్థానిక కూడలి వద్ద అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చేసమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలిపారు. అలాగే శానిటైజర్లు వాడుతూ ఉండాలన్నారు. భౌతిక దూరాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ భక్తవత్సలం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T04:38:48+05:30 IST