ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : డీఎంఅండ్‌హెచ్‌ఓ

ABN , First Publish Date - 2020-10-17T06:52:41+05:30 IST

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ జయచంద్రమోహన్‌ అన్నారు

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : డీఎంఅండ్‌హెచ్‌ఓ

నారాయణపేట టౌన్‌, అక్టోబరు 16 : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ జయచంద్రమోహన్‌ అన్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిలోని పీపీ యూనిట్‌లో ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి హెల్త్‌ స్ర్కీనింగ్‌ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖాశయ క్యాన్సర్‌లను గుర్తించి చికిత్స నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు బాలాజీరావు, పార్వతి, శ్రీకాంత్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T06:52:41+05:30 IST