ప్రతీ ఒక్కరు శాంతి, సహనం కల్గి ఉండాలి
ABN , First Publish Date - 2022-05-22T05:55:42+05:30 IST
ప్రతీ ఒక్కరు శాంతి, సహనం కల్గి ఉండి మత సామరస్యంతో జాతీ ఐక్యతకు, పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని రెవెన్యూ అద నపు కలెక్టర్ కె. సీతారామారావు అన్నారు.
మహబూబ్ నగర్ ( కలెక్టరేట్ ), మే 21 : ప్రతీ ఒక్కరు శాంతి, సహనం కల్గి ఉండి మత సామరస్యంతో జాతీ ఐక్యతకు, పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని రెవెన్యూ అద నపు కలెక్టర్ కె. సీతారామారావు అన్నారు. జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పుర స్కరించుకొని శనివారం ఆయన కలెక్టరేట్ సబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్ర మంలో కలెక్టరేట్ ఏవో కిషన్, ఆయా విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.