పారిశుధ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
ABN , First Publish Date - 2022-05-28T05:38:12+05:30 IST
పారిశుధ్యం మెరుగుకు అందరూ స హకరించాలని ఎంపీడీఓ మహబూబ్బీ, ఎంపీపీ చీర్ల సురే్షయాదవ్ అన్నారు.
చెన్నూరు, మే 27: పారిశుధ్యం మెరుగుకు అందరూ స హకరించాలని ఎంపీడీఓ మహబూబ్బీ, ఎంపీపీ చీర్ల సురే్షయాదవ్ అన్నారు. శు క్రవారం వారు కొండపేటలో పేడదిబ్బలతో నిండిన కేసీ ఉపకాలువను పరిశీలించారు. కాలువ ఏర్పాటు చేసినప్పటి నుంచి వ్యవసాయానికి ఉపయోగపడక కేవలం పేడ దిబ్బలుగా మారిందని, వర్షపు నీరు నిలిచి చెత్తాచెదారం కుళ్లి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. కేసీ కెనాల్ సిబ్బందిచే కాలువను శుభ్రం చేయిస్తామని పేర్కొన్నారు. సర్పంచ తుంగా చంద్రయాదవ్, కార్యదర్శులు సుబ్రమణ్యం, రామసుబ్బారెడ్డి, ఎంపీటీసీ నాగిరెడ్డి పాల్గొన్నారు.