కరోనా కట్టడికి సహకరించాలి

ABN , First Publish Date - 2020-03-28T06:38:34+05:30 IST

కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌లతో...

కరోనా కట్టడికి సహకరించాలి

  • కూరగాయల ధరలను పరిశీలించిన ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌/బొంరాస్‌పేట్‌: కరోనా నియంత్రణకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌లతో కలిసి సబ్‌మార్కెట్‌ యార్డులో కూరగాయలు, మాంసం, పండ్ల ధరలను పరిశీలించారు. అనంతరం రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. ఐబీలో వైద్య, పోలీసు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, వైద్యులు రవీందర్‌యాదవ్‌, సీఐ నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ ఉషారాణిరాజేందర్‌, కౌన్సిలర్‌లు తదితరులు ఉన్నారు.


వలస కూలీల రాకతో భయాందోళన 

బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు తిరిగి సొంత గ్రామాల చేరుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-03-28T06:38:34+05:30 IST