కొవిడ్ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలి..
ABN , First Publish Date - 2021-05-07T04:36:28+05:30 IST
కొవిడ్-19 ఇంటింటి జ్వర సర్వేకు ప్రతీఒక్కరూ సహకరించాలని అదనపుకలెక్టర్ రాజేశం అన్నారు.
-అదనపు కలెక్టర్ రాజేశం
కాగజ్నగర్టౌన్, మే 6: కొవిడ్-19 ఇంటింటి జ్వర సర్వేకు ప్రతీఒక్కరూ సహకరించాలని అదనపుకలెక్టర్ రాజేశం అన్నారు. గురువారం పట్టణంలోని ఆయావార్డుల్లో మోప్మా, మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. జ్వర సర్వేలో కొవిడ్ పాజిటివ్ లక్షణాలున్నట్లయితే ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. అర్హులైన వారంతా భయాన్ని వీడి టీకా వేసుకోవాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నట్లయితే ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వెద్యం చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మోప్మా సిబ్బంది పాల్గొన్నారు.
పలువార్డుల్లో హైపోక్లోరైడ్ స్ర్పే..
కొవిడ్-19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో పలు వార్డుల్లో హైపోకోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆయా వార్డుల్లో తిరుగుతూ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కాలనీల్లో ద్రావణాన్ని స్ర్పే చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.