‘రామ మందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’

ABN , First Publish Date - 2021-01-21T06:17:57+05:30 IST

రామ జన్మభూమి అయోధ్యలో చేపట్టనున్న భవ్య రామమందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఖానాపూర్‌ పట్టణ సంయోజక్‌ మహాజన్‌ జితేందర్‌ అన్నారు.

‘రామ మందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’
జన జాగరణ కార్యక్రమం పోస్టర్లను ప్రదర్శిస్తున్న నాయకులు

ఖానాపూర్‌, జనవరి 20: రామ జన్మభూమి అయోధ్యలో చేపట్టనున్న భవ్య రామమందిర నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని  ఖానాపూర్‌ పట్టణ సంయోజక్‌ మహాజన్‌ జితేందర్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ కాలనీలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామమందిర నిర్మాణ నిధి సమర్పణ కార్యక్రమంలో భాగంగా జనజాగరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు పడాల ప్రభాకర్‌, దొనికెల రాజేశ్వర్‌, తుమ్మనపెల్లి సాంకేత్‌, అనిల్‌, రాజు, సందీప్‌, నాగరాజు, శరత్‌తో పాటు బీజేపీ, హిందూ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్‌, బీజేవైఎం, ఏబీవీపీ, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:17:57+05:30 IST