నేరాల నియంత్రణకు ప్రతీ ఒక్కరు సహకరించాలి
ABN , First Publish Date - 2022-06-26T03:57:16+05:30 IST
నేరాల నియంత్రణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల విని యోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేలాల, పౌనూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్ధాలు, మహిళలను వేధించడం, సైబర్ క్రైం నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
జైపూర్, జూన్ 25: నేరాల నియంత్రణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల విని యోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేలాల, పౌనూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్ధాలు, మహిళలను వేధించడం, సైబర్ క్రైం నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతీ, యువకుల్లో వచ్చిన మార్పులను ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లయితే చెడు వ్యసనాల నుంచి కాపాడవచ్చన్నారు. అనంతరం యువకులకు క్రికెట్ కిట్లను అందజేశారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్ఐ రామకృష్ణ, చైల్డ్లైన్ డైరెక్టర్ ఆంటోని, జిల్లా కో ఆర్డినేటర్ సత్యనారాయణ, సర్పంచులు శ్యామల, సారయ్య, ఉపసర్పంచు బోగె నగేష్ పాల్గొన్నారు.