అందరూ బాధ్యతతో పనిచేయాలి
ABN , First Publish Date - 2021-05-17T05:37:25+05:30 IST
అందరూ బాధ్యతతో పనిచేయాలి
షాద్నగర్ : కరోనా కట్టడికి అందరూ బాధ్యతతో పని చేయాలని షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. కొవిడ్తో హోం ఐసోలేషన్లో ఉన్న పోలీసులకు సాయమందించడానికి పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆదివారం షాద్నగర్ చౌరస్తాలో ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి కరోనా మందులను ఏసీపీ చేతుల మీదుగా పోలీసులకు అందజేశారు. కార్యక్రమంలో కొందుర్గు సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు విజయ్భాస్కర్, శ్యాంసుందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- ఐసోలేషన్ కిట్ల పంపిణీ
తలకొండపల్లి/మొయినాబాద్ రూరల్/నందిగామ/చౌదరిగూడ: తలకొండపల్లి మండలం రాంపూర్, కోరింతకుంట తండాల్లో ఆదివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కరోనాపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. కరోనా బారిన పడిన వారికి జడ్పీటీసీ, ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ సమకూర్చిన ఐసోలేషన్ కిట్లను పంపిణీ చే శారు. మనోధైర్యంతోనే కరోనాపై విజయం సాధించగలం అన్నారు. ఉపసర్పంచ్ మోహన్రెడ్డి, రమేశ్, సక్రు, రవీందర్, మల్లేశ్, శ్రీను, నర్సింహ, యాదగిరి, జగదీశ్, జంగమ్మ పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని సర్పంచ్ జిల్లెల్ల వెంకట్రెడ్డి అన్నారు. నందిగామ, అంతిరెడ్డిగూడ, చంద్రాయన్గూడలో పంచాయతీ సిబ్బంది రసాయనాలు పిచికారీ చేశారు. కరోనా నియంత్రణకు అందరం కృషిచేద్దామని మొయినాబాద్ మండలం అమ్డాపూర్ సర్పంచ్ రవళిగోపీకృష్ణారెడ్డి అన్నారు. గ్రామంలో రసాయనాలను పిచికారీ చేయించారు. ధైర్యంగా ఉండి కరోనాను జయించాలని బీజేపీ నేత ఏపీ మిథున్రెడ్డి అన్నారు. చౌదరిగూడ మండలం పె ద్దఎల్కిచర్లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో కిట్లను పంపిణీ చేశారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉ ండాలని సూచించారు. సర్పంచ్ కె.భూపాలచారి, నాయకులు పి.వెంకటేశ్వర్రెడ్డి, విజయభాస్కర్, శ్యాంసుందర్రెడ్డి, మనోహర్రెడ్డి, ప్రదీ్పరె డ్డి, కదిరే క్రిష్ణ, జగదీష్, శ్రీశైలం, ప్రదీప్, కృష్ణయ్య పాల్గొన్నారు.