కరోనాతో అందరికీ ఇబ్బందే..!
ABN , First Publish Date - 2021-01-25T06:56:21+05:30 IST
‘కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సినీ నటుడు సుమన్
తిరుమల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామంది టెక్నీషియన్లు, వర్కర్లు అవస్థ పడ్డారు. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ మొదలయ్యాయి. తిరిగి అందరూ సాధారణ పరిస్థితులకు చేరుకుంటున్నారు’ అని ప్రముఖ సినీనటుడు సుమన్ తెలిపారు. ఆదివారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. గత ఏడాది చిన్నాపెద్ద అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ సమస్యల్లో చిక్కకున్నారన్నారు. జీవితానికి సంబంధించిన చాలా విషయాలు కరోనా నేర్పించిందన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. కరోనా ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ వాడాలన్నారు. అలాగే రెండు రాష్ట్రాల సీఎంలు బాగుండాలని, భవిష్యత్లో ఎలాంటి ముప్పు వాటిల్లినా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని స్వామిని కోరుకున్నానన్నారు.