‘లాక్డౌన్కు ప్రతి ఒక్కరు సహకరించాలి’
ABN , First Publish Date - 2020-04-10T11:15:08+05:30 IST
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి నిర్మల్ జిల్లా శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు లాక్డౌన్కు ప్రతి
నిర్మల్, ఏప్రిల్ (ఆంధ్రజ్యోతి) : కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి నిర్మల్ జిల్లా శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు లాక్డౌన్కు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. గురువారం నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లీం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేంధర్రెడ్డి, పట్టణ సీఐ జాన్ దివాకర్, రూరల్ సీఐ శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు.