tobacco వల్ల ప్రతి ఏటా 8 మిలియన్ల మంది మృతి

ABN , First Publish Date - 2022-05-31T18:33:23+05:30 IST

ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా ప్రజలు పొగాకు కారణంగా మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది...

tobacco వల్ల ప్రతి ఏటా 8 మిలియన్ల మంది మృతి

 ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి

జెనీవా:  ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా ప్రజలు పొగాకు కారణంగా మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం- 2022 సందర్భంగా మంగళవారం పొగాకు వల్ల పర్యావరణ ప్రభావాన్ని హైలైట్ చేయాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది.ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా ప్రజలు పొగాకు వాడకంతో మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రపంచ నిరోధక దినోత్సవం సందర్భంగా తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో  ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం పర్యావరణంపై కూడా వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. పొగాకు వల్ల మీరు ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని యూఎన్ పేర్కొంది. ధూమపానం, పొగాకు వినియోగం వల్ల గుండె జబ్బులు వస్తాయని నిపుణులు చెప్పారు.


 సిగరెట్ లేదా హుక్కా తాగడం వల్ల గర్భధారణ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెపుతున్నారు.మహారాష్ట్రలో ఎక్కువ మంది పొగాకు వినియోగదారులు ఉన్నారని సర్వేలో తేలింది. దశాబ్దం క్రితం కంటే 7 రెట్లు ఎక్కువ యూపీలో 44.1శాతం మంది పురుషులు, 8.4శాతం మంది స్త్రీలు, 15 ఏళ్లు పైబడిన వారు పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.


Updated Date - 2022-05-31T18:33:23+05:30 IST