ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలి

ABN , First Publish Date - 2021-01-27T04:58:00+05:30 IST

విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలి
మాట్లాడుతున్న ఐఏఎస్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి

పెండ్లిమర్రి, జనవరి 26: విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని శిక్షణ  పొందుతున్న ఐఏఎస్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నందిమండలం జడ్పీ హైస్కూల్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జెండా వందనం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలన్నారు. అందకు అవసరమైన వార్త పత్రికలు, పుస్తక పఠనం అవసరమన్నారు. సోషల్‌ మీడియా, టెక్నాలజీని అవసరమైన మేరకే మంచికి ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం రాహుల్‌కుమార్‌రెడ్డి దంపతులను ఉపాధ్యాయ బృందం సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టరు కళావతి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, వేణు, శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T04:58:00+05:30 IST