ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలి
ABN , First Publish Date - 2021-03-07T07:15:24+05:30 IST
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్థేశించుకుని ఆ లక్ష్యసాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని కందుకూరు సీఐ ఎం.విజయకుమార్ కోరారు.
సీఐ విజయకుమార్
కందుకూరు, మార్చి 6: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్థేశించుకుని ఆ లక్ష్యసాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని కందుకూరు సీఐ ఎం.విజయకుమార్ కోరారు. స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డి గ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టరు ఎం.రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి జీవితంలో డిగ్రీ ఎంతో కీలకమని ఈ దశలో ఉన్నత లక్ష్యాలను నిర్థేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయతీరాలకు చేరుతారన్నారు. ప్రిన్సిపాల్ డాక్టరు ఎం. రవికుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి సహకారంతో ఈ ఏడాది కళాశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. చక్కని మౌలిక వసతులతో మెరుగైన విద్యాబోధన చేస్తున్నామని వివరించారు. తమ కళాశాలలో చేరి వారిని ఉన్నత స్థితిలో స్థిరపడేలా చూడాలన్న ఏకైక లక్ష్యంతో శ్రమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై కేకే తిరుపతిరావు, కళాశాల అధ్యాపకులు డాక్టరు ఎం.ఆంజనేయులు, విజయశ్రీ, మైత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.