ప్రతీ సెషన్‌లో ఓ కొత్త హీరోను కనుగొన్నాం: సచిన్

ABN , First Publish Date - 2021-01-19T22:27:01+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకోవడంపై

ప్రతీ సెషన్‌లో ఓ కొత్త హీరోను కనుగొన్నాం: సచిన్

బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకోవడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో దారుణంగా ఓడి పోయిన భారత్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియగా, గబ్బా టెస్టులో అద్భుత విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.


ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆస్ట్రేలియాపై సాధించిన ఈ సిరీస్ విజయాన్ని.. అతి గొప్ప విజయంగా అభివర్ణించాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రతీ సెషన్‌లో ఓ కొత్త హీరోను కనుగొన్నామని అన్నాడు. దెబ్బ తగిలిన ప్రతిసారి మరింత బలంగా లేచి నిలబడ్డామని పేర్కొన్నాడు. భయం లేకుండా బౌండరీలు బాదామని, కానీ నిర్లక్ష్యంగా ఆడలేదన్నాడు. గాయాలు, అనిశ్చితి వేధించినా ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డామని సచిన్ ట్వీట్ చేశాడు. 

 

Updated Date - 2021-01-19T22:27:01+05:30 IST