ప్రతి రాజస్థానీ బీజేపీకే మద్దతివ్వాలి

ABN , First Publish Date - 2022-07-03T05:21:49+05:30 IST

ప్రతి రాజస్థానీ బీజేపీకే మద్దతివ్వాలి

ప్రతి రాజస్థానీ బీజేపీకే మద్దతివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా

  • తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
  • వారసత్వ పాలనకు చరమగీతం పాడాలి
  • రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరరాజే సింధియా
  • క్లాసిక్‌ కన్వెన్షన్‌లో రాజస్థానీలతో సమావేశం

శంషాబాద్‌ రూరల్‌/శంషాబాద్‌, జూలై 2: ప్రతి రాజస్థానీ బీజేపీకే మద్దతు ఇవ్వాలని రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరరాజే సింధియా పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు రాజస్థాన్‌ ప్రజలు(మర్వాడీ)లు ఘనస్వాగతం పలికారు. అనంతరం క్లాసిక్‌ కన్వెన్షన్‌లో నగరంతో పాటు శంషాబాద్‌ ప్రాంతంలో నివాసముండే దాదాపు 3,500 మంది రాజస్థానీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో వారసత్వ పాలనకు చమరగీతం పాడాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. దేశాన్ని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు బీజేపీ ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణలోనూ అవి అమలు కావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని, దానికి మీ మద్దతు ఉండాలని ఆమె కోరారు. దేశం మెచ్చిన నేత ప్రధానమంత్రి మోదీ అని చెప్పారు. అలాగే రాజస్థాన్‌లోనూ బీజేపీకి మద్దతు తెలిపాలని కోరారు. తెలంగాణలో కార్యవర్గ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రచేస్తోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. నీతివంతమైన పాలన ఒక్క బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. గతప్రభుత్వాలు దేశాన్ని అప్పులపాలు చేశారని, అప్పుల్లేని దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి మోదీ కృషిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయనుందని తెలిపారు. అంతకు ముందు రాజస్థానీ మహిళలు ఆమెకు శాలువాలు కప్పి, పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-07-03T05:21:49+05:30 IST