నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

ABN , First Publish Date - 2022-06-26T06:37:15+05:30 IST

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు.

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి
చండూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రేమ్‌కరణ్‌రెడ్డి

జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి 

మర్రిగూడ, చండూరు, జూన 25: నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. శనివారం మర్రిగూడ మండలంలోని ప లు గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. అంతంపే ట నుంచి శివన్నగూడకు వెళ్లే రోడ్డు వెంట ఇరువైపులా మొక్కలు ఎండిపోయినందున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎండిపోయిన మొక్కల చోట కొత్త మొక్కలు నాటాలని ఎంపీడీవోకు సూచించారు. అంతంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులతో పాటు పల్లెప్రగతికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. చండూరు ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామపంచాయతీకి 10 వేల మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో జానయ్య, ఎంపీవో స్వరూపరాణి, కార్యాలయ పర్యవేక్షక్షుడు మనోహర్‌, పీఆర్‌ ఏఈ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T06:37:15+05:30 IST