నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-09-18T06:25:48+05:30 IST

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ద మ్మాయిగూడ

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు 


కీసర రూరల్‌: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ద మ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి 15వ వార్డులోని లేక్‌వ్యూ కాలనీలో మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఒకొక్కరు మూడేసి మొక్కలు చొప్పున నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వసుపతి ప్రణీత, వైస్‌చైర్మన్‌ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కమిషనర్‌ స్వామి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T06:25:48+05:30 IST