ప్రతీ రైతూ పంట నమోదు చేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-20T04:58:37+05:30 IST

ప్రతీ రైతూ పంట నమోదును తప్పకుండా చేయించుకోవాలని ఇన్‌చార్జి ఏఓ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.

ప్రతీ రైతూ పంట నమోదు చేయించుకోవాలి
కొండాపురం మండలం రేగడిపల్లె గ్రామంలో పంట పొలాలనను పరిశీలిస్తున్న ఏఓ వెంకటకృష్ణారెడ్డి

కొండాపురం, ఆగస్టు 19: ప్రతీ రైతూ పంట నమోదును తప్పకుండా చేయించుకోవాలని ఇన్‌చార్జి ఏఓ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని రేగడిపల్లె, బురుజుపల్లె, కోనవారిపల్లె గ్రామాలలో రైతులతో కలిసి పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందిని కలిస్తే ఏ పంట సాగుచేశారో వారికి తెలియజేసి పంట పొలాలను పరిశీలించి సర్వేనెంబర్ల ఆధారంగా పంట నమోదు చేస్తామని ఏఓ తెలిపారు. పత్తి రైతులకు తెగుళ్ల నివారణకు  సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T04:58:37+05:30 IST