పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-05-20T05:15:30+05:30 IST
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించడంతోపాటు పదవులు లభిస్తాయని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
కష్టపడే వారికి పదవులు
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
బెజ్జంకి, మే 19: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించడంతోపాటు పదవులు లభిస్తాయని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బెజ్జంకిలో గురువారం నిర్వహించిన మండల స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ధరల పెంపుతో బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలను మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. వరంగల్ సభలో రాహుల్గాంధీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్ను ప్రతీ గడపకు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు రత్నాకర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, శ్రావణ్, యూత్ విభాగం మండలాధ్యక్షుడు శ్రీకాంత్, కృష్ణ పాల్గొన్నారు.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పోస్టర్ ఆవిష్కరణ
సిద్దిపేట టౌన్, మే 19: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు డిక్లరేషన్ పోస్టర్ను కాంగ్రెస్ నాయకుడు దరిపల్లి చంద్రం, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వరంగల్ సభలో రాహుల్గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, డిక్లరేషన్ను వివరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తప్పెట శంకర్, బర్మా రామచంద్రం, మిట్టపల్లి గణేష్, గరిపల్లి రాములు, సుంచు రమేష్, ఎల్లం, వెంకట్, సయ్యద్ అతీక్, గయాసుద్దీన్, హాసునుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.