ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
ABN , First Publish Date - 2022-01-21T05:05:55+05:30 IST
కాంగ్రెస్ అభివృద్ధి కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ అన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్
హత్నూర, జనవరి 20 : కాంగ్రెస్ అభివృద్ధి కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్లో సభ్యత్వ నమోదుపై నాయకులతో, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ భాస్కర్యాదవ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి జరుగుతున్నదన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పార్టీ ఇస్తున్నదన్నారు. మండలంలో పదివేలు సభ్యత్వాలు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటికీ 2500 సభ్యత్వాలు పూర్తి చేశామని మండల నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు రవీందర్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కిష్టయ్య, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివా్సరెడ్డి, దౌల్తాబాద్ సర్పంచ్ వెంకటేశం, నాయకులు ఆంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.