ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ABN , First Publish Date - 2021-10-19T06:18:19+05:30 IST

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ అన్నారు. సోమవారం మండలంలోని సుంకరవారిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత కార్యకర్తలు, టీడీపీ అభిమానులు ఆయనను ఎడ్ల బండి పై ఊరేగించారు. అనంతరం ర్యాలీగా కార్యకర్తలు గ్రామ దేవత అయిన పోలేరమ్మ ఆలయం వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి
రమే్‌షను ఎడ్ల బండి పై ఊరేగిస్తున్న గ్రామ టీడీపీ నాయకులు

 దర్శి టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ 

ముండ్లమూరు, అక్టోబరు 18 : తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు  ప్రతి కార్యకర్త  సైనికుడిలా పనిచేయాలని టీడీపీ ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ అన్నారు. సోమవారం మండలంలోని సుంకరవారిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  తొలుత కార్యకర్తలు, టీడీపీ అభిమానులు ఆయనను ఎడ్ల బండి పై ఊరేగించారు. అనంతరం ర్యాలీగా కార్యకర్తలు గ్రామ దేవత అయిన పోలేరమ్మ ఆలయం వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గ్రామంలో టీడీపీ నాయకుడు మేనగ నందయ్య ఇంటి వద్ద గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరాచకాలు, దోపిడీలు పెరిగి పోయాయన్నారు. సామాన్యుడు  బతికే పరిస్థితి లేదన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం తప్ప ఎక్కడైనా ఒక్క చిన్న అభివృద్ధి కూడా చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మండల టీడీపీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, కోడెగం మస్తాన్‌రావు, దర్శి నియోజక వర్గ రైతు సంఘం అధ్యక్షుడు మేదరమెట్ల వెంకటరావు, నందయ్య, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి, ఇందూరి పిచ్చిరెడ్డి, జంపాని శ్రీనివాసరావు, కిలారు ఆంజనేయులు, చాగంటి రాంబాబు, సర్పంచ్‌ కూరపాటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌లు నరసింహారావు, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, నాగండ్ల రమణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:18:19+05:30 IST