మూల్యాంకనం ప్రశాంతం : డీజీఈ
ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST
ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్ ప్రశాంతంగా జరుగుతుందని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (డీజీఈ) డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు.
కడప(ఎడ్యుకేషన్), మే 16 : ఎస్ఎస్సీ స్పాట్ వాల్యుయేషన్ ప్రశాంతంగా జరుగుతుందని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (డీజీఈ) డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. కడప నగరం నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్లో ఈ నెల 13వ తేదీ నుంచి జరుగుతున్న స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన పాఠశాల (ఆర్జేడీ) ఎంవీ.కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సి.దేవరాజుతో పాటు కలిసి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. పరీక్షా పత్రాన్ని వాల్యుయేషన్ చేసే సమయంలో ఉపాధ్యాయులు అందరూ ఏకాగ్రతతో చేయాలని వాల్యుయేషన్, కాలిక్యులేషన్ మార్కులు ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగినట్లయితే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరిం చారు. అనంతరం స్పాట్ వాల్యుయేషన్లో ఉపాధ్యాయులకు కల్పిస్తున్న వసతులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏసీ వెంకటేశ్వర్లు, కడప, ప్రొద్దుటూరు, డీవైఈవో నాగరాజు, ఎంఈవోలు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.