వలస కూలీల తరలింపు

ABN , First Publish Date - 2020-06-02T10:47:34+05:30 IST

ఒరిస్సాకు చెందిన వలస కూలీలను సోమవారం అధికారు లు వారి స్వస్థలాలకు తరలించారు.

వలస కూలీల తరలింపు

ఖిల్లా, జూన్‌ 1: ఒరిస్సాకు చెందిన వలస కూలీలను సోమవారం అధికారు లు వారి స్వస్థలాలకు తరలించారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి తొమ్మి ది ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు వీరిని తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా ఒరిస్సాకు తరలించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ మోపాల్‌, మాక్లూర్‌ మం డలాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వీరు జిల్లాకు వచ్చారన్నారు.


వర్షాలు మొదలయ్యే అవకాశం ఉండడంతో పనులు లేనందున ప్రభుత్వం ఒరిస్సాకు  వెళ్లేందుకు వీరికి అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతి క దూరం పాటించి శానిటైజర్‌లు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీ  కార్తికేయ, మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్డీవో వెంకటయ్య, ఏసీ పీలు శ్రీనివాస్‌కుమార్‌, ప్రభాకర్‌రావులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T10:47:34+05:30 IST