నివేశన స్థలాల డాక్యుమెంట్లు తరలింపు

ABN , First Publish Date - 2020-07-04T10:54:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8 వ తేదీన పంపిణీ చేయనున్న ఇంటి స్థలాల డాక్ముమెంట్లను మండలాలకు చేర్చుతున్నారు. లబ్ధిదారుల పేరుతో రూ.10

నివేశన స్థలాల డాక్యుమెంట్లు తరలింపు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8 వ తేదీన పంపిణీ చేయనున్న ఇంటి స్థలాల డాక్ముమెంట్లను మండలాలకు చేర్చుతున్నారు. లబ్ధిదారుల పేరుతో రూ.10 స్టాంపులపై ముద్రించిన ఇంటి స్థలాల డాక్యుమెంట్లను వారి పేర్లతో ప్రింటింగ్‌ పూర్తి చేసి కలెక్టరేట్‌కు పంపించారు. ఇక్కడి నుంచి శుక్రవారం ఉదయం నుంచి ఆయా మండలాలకు పంపే ఏర్పాట్లను చేశారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 8వతేదీన దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతిని పురష్కరించుకొని లబ్ధిదా రులకు ఇంటిపట్టాలు పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 1.31 ల క్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. డాక్యుమెంట్లను తహసీల్దార్లు తీ సుకెళ్ళాలని కలెక్టరేట్‌ నుంచి ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ సిబ్బంది వాటిని తమ మండలాలకు తరలించారు.

Updated Date - 2020-07-04T10:54:21+05:30 IST