ఎలక్ట్రిక్‌ బస్సులతో ఈవీ ట్రాన్స్‌ ఇంటర్‌సిటీ సర్వీసులు

ABN , First Publish Date - 2021-10-14T06:06:46+05:30 IST

దేశంలోనే తొలిసారిగా ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ ఈవీట్రాన్స్‌ ప్రారంభించింది.

ఎలక్ట్రిక్‌ బస్సులతో ఈవీ ట్రాన్స్‌ ఇంటర్‌సిటీ సర్వీసులు

ఒక సారి ఛార్జితో 350 కిలోమీటర్ల ప్రయాణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలోనే తొలిసారిగా ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ ఈవీట్రాన్స్‌ ప్రారంభించింది. ‘పురి బస్‌’ బ్రాండ్‌తో పుణె, ముంబై మధ్య ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్‌ బస్సులను లాంఛనంగా ప్రారంభించినట్లు మేఘా ఇంజినీరింగ్‌ తెలిపింది. ఒక సారి ఛార్జింగ్‌తో 350 కిలోమీటర్ల సుదూర ప్రయాణాన్ని కాలుష్య రహితంగా చేయొచ్చని ఈవీట్రాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ రైజడా అన్నారు. 


అన్ని సౌకర్యాలు ఉంటాయ్‌..

ప్రయాణికుల సౌకర్యానికి ఎటువంటి లోటు లేకుండా.. బస్సును రూపొందించారు. ఏసీ, సౌకర్యవంతమైన సీట్లు, టీవీ, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వైఫై వంటి అన్ని ఆధునిక  సౌకర్యాలు, భద్రత సదుపాయాలు  12 మీటర్ల పొడవు ఉండే ‘పురిబ్‌స’ల్లో ఉంటాయి. మేఘా ఇంజినీరింగ్‌కే చెందిన ఓలెకా్ట్ర  గ్రీన్‌టెక్‌ ఇంటర్‌సిటీ సేవలకు ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేసింది. వివిధ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల తరఫున 400 పైగా ఎలక్ట్రిక్‌ బస్సులను ఈవీట్రాన్స్‌ నిర్వహిస్తోంది.

Updated Date - 2021-10-14T06:06:46+05:30 IST