నిస్వార్థసేవలకు చిరస్థాయి గుర్తింపు: చల్లా
ABN , First Publish Date - 2022-07-03T06:02:14+05:30 IST
నిస్వార్థసేవలకు చిరస్థాయి గుర్తింపు: చల్లా
కడ్తాల్, జూలై 2: నిస్వార్థ సేవలకు సమాజంలో చిరస్థాయి గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. ఆమనగల్లు లియోక్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన క్యామ రాజేశ్, ఉపాధ్యక్షుడు కళ్యాణకార్ భాను కిరణ్లకు శనివారం కడ్తాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీచంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్సరెడ్డి, కడ్తాల, తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, గుజ్జల మహేశ్లతో కలిసి రాజేశ్, భానుకిరణ్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జహంగీర్బాబా, పూల శంకర్, రామచందర్ నాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా అన్మా్సపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ కే.శశిరేఖ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని వంశీచంద్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ శంకర్, నాయకులు కంబాల రామకృష్ణ, కేశవులు, జగన్, సుధీర్రెడ్డి, లక్ష్మయ్య, జంగయ్య, శ్రీరాములుగౌడ్ ఉన్నారు.